BREAKING
పర్వతాపురంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ద్రావిడ విశ్వవిద్యాయంలో డిప్లమా ఇన్ యోగా కోర్స్ పరీక్ష ప్రారంభం ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం చిట్యాల మార్కెట్ కమిటీలో ఘనంగా స్వాగత – వీడ్కోలు కార్యక్రమం పుంగనూరు MRO కార్యాలయం వద్ద నిరసన బీబీనగర్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సంబరాలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన భువనగిరి మాజీ మార్కెట్ డైరెక్టర్ భువనగిరి సదానందం గౌడ్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ. తహసీల్దార్ కార్యాలయంలో సిమెంట్ బస్తాలు చోరీ చాట్రాయిలో మహిళల భద్రతపై అవగాహన సదస్సు పర్వతాపురంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ద్రావిడ విశ్వవిద్యాయంలో డిప్లమా ఇన్ యోగా కోర్స్ పరీక్ష ప్రారంభం ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం చిట్యాల మార్కెట్ కమిటీలో ఘనంగా స్వాగత – వీడ్కోలు కార్యక్రమం పుంగనూరు MRO కార్యాలయం వద్ద నిరసన బీబీనగర్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సంబరాలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన భువనగిరి మాజీ మార్కెట్ డైరెక్టర్ భువనగిరి సదానందం గౌడ్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ. తహసీల్దార్ కార్యాలయంలో సిమెంట్ బస్తాలు చోరీ చాట్రాయిలో మహిళల భద్రతపై అవగాహన సదస్సు
www.ntodaynews.com

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి

తెలంగాణ
06 Mar, 2026 - 04:06 AM
171 వీక్షణలు
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి NTODAY NEWS: బొమ్మలరామారం యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం నాగినేనిపల్లి గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల పనులను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వివిధ దశల్లో కొనసాగుతున్న ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. గ్రామంలో మొత్తం ఎన్ని ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యాయి, వాటిలో ఎన్ని ఇండ్లు పూర్తి అయ్యాయి, మిగిలినవి ఏ దశలో ఉన్నాయనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులకు అవసరమైన నిర్మాణ సామగ్రిని తక్కువ ధరకు అందేలా చర్యలు తీసుకుని ఇండ్ల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఇప్పటివరకు పూర్తి చేసిన పనుల మేరకు లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ అవుతున్నాయా అని కూడా కలెక్టర్ ఆరా తీశారు. మిగిలిన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేస్తే చివరి బిల్లు కూడా విడుదల అవుతుందని, త్వరలో గృహప్రవేశాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పి. శ్రీనివాసరావు, హౌసింగ్ డీఈ, ఇన్‌చార్జి ఎంపీడీవో గడ్డం జ్ఞాన ప్రకాశ్ రెడ్డి, హౌసింగ్ ఏఈ ప్రశాంత్, గ్రామపంచాయతీ కార్యదర్శి నవీన్, గ్రామ సర్పంచ్ బట్కీరు జ్యోతి బీరప్ప, ఉపసర్పంచ్ రామిడి దయాకర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రామిడి జంగారెడ్డి, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. #Bommalaramaram #NagineniPalli #IndirammaHouses #AnuragJayanti #YadadriBhuvanagiri #TelanganaNews #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube