BREAKING
30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు!
Date of Publish : 06 March 2026, 04:06 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి

తెలంగాణ
06 Mar, 2026 - 04:06 AM
269 వీక్షణలు
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి NTODAY NEWS: బొమ్మలరామారం యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం నాగినేనిపల్లి గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల పనులను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వివిధ దశల్లో కొనసాగుతున్న ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. గ్రామంలో మొత్తం ఎన్ని ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యాయి, వాటిలో ఎన్ని ఇండ్లు పూర్తి అయ్యాయి, మిగిలినవి ఏ దశలో ఉన్నాయనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులకు అవసరమైన నిర్మాణ సామగ్రిని తక్కువ ధరకు అందేలా చర్యలు తీసుకుని ఇండ్ల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఇప్పటివరకు పూర్తి చేసిన పనుల మేరకు లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ అవుతున్నాయా అని కూడా కలెక్టర్ ఆరా తీశారు. మిగిలిన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేస్తే చివరి బిల్లు కూడా విడుదల అవుతుందని, త్వరలో గృహప్రవేశాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పి. శ్రీనివాసరావు, హౌసింగ్ డీఈ, ఇన్‌చార్జి ఎంపీడీవో గడ్డం జ్ఞాన ప్రకాశ్ రెడ్డి, హౌసింగ్ ఏఈ ప్రశాంత్, గ్రామపంచాయతీ కార్యదర్శి నవీన్, గ్రామ సర్పంచ్ బట్కీరు జ్యోతి బీరప్ప, ఉపసర్పంచ్ రామిడి దయాకర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రామిడి జంగారెడ్డి, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. #Bommalaramaram #NagineniPalli #IndirammaHouses #AnuragJayanti #YadadriBhuvanagiri #TelanganaNews #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube