www.ntodaynews.com
కేసీ కెనాల్కు సాగునీరు విడుదల
తెలంగాణ
కేసీ కెనాల్కు సాగునీరు విడుదల
NTODAY NEWS: నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున
నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని పగిడ్యాల, జూపాడు బంగ్లా మండలాల కేసీ కెనాల్ ఆయకట్టు రైతుల విన్నపం మేరకు కేసీ కెనాల్కు సాగునీరు విడుదలైంది.
ముచ్చుమర్రి గ్రామంలో జరిగిన కార్యక్రమం సందర్భంగా రైతులు తమ పంటలకు రెండు తడులు నీరు అందితేనే పంట చేతికివస్తుందని, లేకపోతే ఎండిపోతుందని విన్నవించారు. ఈ విషయాన్ని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరి జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి దృష్టికి తీసుకెళ్లారు.
దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారుల ద్వారా పంటల పరిస్థితిపై నివేదికలు సేకరించారు. అనంతరం సోమవారం మల్యాల ఎత్తిపోతల పథకం నుంచి ఒక పంపు, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి మరో పంపు ద్వారా కేసీ కెనాల్కు సాగునీరు విడుదల చేయాలని ఆదేశించారు.
నీటి కొరత కారణంగా పంటలు ఎండిపోతాయన్న ఆందోళన మధ్య సాగునీరు విడుదల కావడంతో ఆయకట్టు రైతులు సంతృప్తి వ్యక్తం చేశారు.
#Nandyal #KCCanal #Irrigation #Farmers
Follow us on
Website
Facebook
Instagram
YouTube