ఇతరుల పట్ల సేవా భావం కలిగి ఉండాలి
ఇతరుల పట్ల సేవా భావం కలిగి ఉండాలి – ఎస్సై వల్లి పద్మ
కామవరపుకోట:తడికలపూడి ఎస్సై శ్రీమతి వల్లి పద్మ మంగళవారం తడికలపూడి పోలీస్ స్టేషన్లో సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు ఎస్సైను శాలువాతో సత్కరించారు.ఎస్సై వల్లి పద్మ మాట్లాడుతూ, "ఇతరుల పట్ల సేవా భావం కలిగి ఉండడం మానవత్వానికి ప్రతిబింబం" అని చెప్పారు. మానవహిత సేవలు, ప్రజల పట్ల సానుభూతి భావనను ప్రదర్శించడం సమాజంలో మార్పు తెచ్చే మార్గం అని ఆమె తెలిపారు. సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, మానవత్వంతో చేసిన సేవలను అభినందిస్తూ, ప్రజలకు, ముఖ్యంగా యువతకు అవగాహన కల్పించే కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ వీరమల్ల మధు, గౌరవ సలహాదారులు టీవీఎస్ రాజు, ఉపాధ్యక్షులు మున్నంగి శ్రీనివాస్, కార్యదర్శి నిజాపరపు దుర్గాప్రసాద్, సౌజన్ సాయి తదితరులు పాల్గొన్నారు.