జాతీయ చెస్ ఛాంపియన్ వేముల అర్జున్కు ఘన సన్మానం
జాతీయ చెస్ ఛాంపియన్ వేముల అర్జున్కు ఘన సన్మానం
లక్షెట్టిపేట: జాతీయ స్థాయి అండర్-14 చెస్ ఛాంపియన్షిప్లో అద్భుత ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానంలో నిలిచిన మాస్టర్ వేముల అర్జున్ను లక్షెట్టిపేట పట్టణ & మండల పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
లక్షెట్టిపేట పట్టణానికి చెందిన మన పద్మశాలి ముద్దుబిడ్డ వేముల మధు గారి కుమారుడైన అర్జున్.. చిన్న వయసులోనే జాతీయ స్థాయి క్రీడలో సత్తా చాటి ప్రథమ పతకం సాధించడం పట్ల సంఘం నాయకులు తీవ్ర హర్షం వ్యక్తం చేశారు. ఈ అపూర్వ విజయానికి గుర్తింపుగా లక్షెట్టిపేట పట్టణ & మండల సంఘం ప్రతినిధులు మాస్టర్ అర్జున్ను శాలువాతో సత్కరించి, ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ.. "అర్జున్ సాధించిన ఈ విజయం మన ప్రాంతానికే గర్వకారణం. భవిష్యత్తులో జరగబోయే అంతర్జాతీయ స్థాయి చెస్ పోటీల్లో సైతం అర్జున్ పాల్గొని మరెన్నో ప్రథమ పతకాలు సాధించాలి. ఉన్నత శిఖరాలను అధిరోహించి మన సమాజానికి, ప్రాంతానికి మరింత కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము" అని ఆకాంక్షించారు.
ఈ సన్మాన కార్యక్రమంలో లక్షెట్టిపేట పట్టణ మరియు మండల సంఘం అధ్యక్షులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు