చాట్రాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో క్యాన్సర్పై అవగాహన సదస్సు
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం (02-07-2026) విద్యార్థులకు క్యాన్సర్పై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నూజివీడు రోటరీ క్లబ్ సౌజన్యంతో, హైదరాబాద్లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి వైద్యుల సహకారంతో నిర్వహించారు.
ఈ సందర్భంగా వైద్య నిపుణులు విద్యార్థులకు క్యాన్సర్ వ్యాధి లక్షణాలు, వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆరోగ్యకరమైన జీవనశైలి ప్రాముఖ్యత, పొగాకు మరియు ఇతర హానికర అలవాట్ల వల్ల కలిగే ప్రమాదాలపై వివరించారు. ప్రారంభ దశలోనే వ్యాధిని గుర్తిస్తే చికిత్స సులభమవుతుందని, ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు వైద్యులు సమాధానాలు ఇస్తూ ఆరోగ్య అవగాహన పెంపొందించడానికి అవసరమైన సూచనలు అందించారు. కార్యక్రమంలో నూజివీడు రోటరీ క్లబ్ సభ్యులు, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి వైద్య బృందం, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కృష్ణయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.