జగిత్యాల జిల్లాలో ఏసీబీ దాడులు....
తెలంగాణ
/
జగిత్యాల
జగిత్యాల జిల్లాలో ఏసీబీ దాడులు.. రూ.30 వేల లంచం తీసుకుంటూ గిరిధావర్ పట్టివేత
జగిత్యాల జిల్లా బీర్పూర్ తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులు నిర్వహించారు. బాధితురాలి నుంచి రూ.30 వేల లంచం తీసుకుంటుండగా గిరిధావర్ రాహుల్ను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.
ఏసీబీ డీఎస్పీ గట్ల మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. లంచం తీసుకుంటున్న రాహుల్ను అదుపులోకి తీసుకున్న అధికారులు విచారణ చేపట్టారు. లంచం డిమాండ్కు సంబంధించిన వివరాలు, సంబంధిత అంశాలపై ఏసీబీ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీబీ అధికారులు స్పష్టం చేస్తున్నారు.