www.ntodaynews.com
జగన్మోహన్ రెడ్డి ని కలిసిన కర్నూలు జీజీహెచ్ పారిశుద్ధ్య కార్మికులు
ఆంధ్రప్రదేశ్
/
కర్నూలు
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కర్నూలు ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి (జీజీహెచ్) పారిశుద్ధ్య కార్మికులు కలిసి తమ సమస్యలను వివరించారు. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తమను విధుల నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నప్పటికీ కొత్త కాంట్రాక్టర్ వచ్చిన వెంటనే ఉద్యోగాల నుంచి తొలగించారని, ఉన్నపళంగా విధులు కోల్పోవడంతో కుటుంబాలు రోడ్డున పడ్డాయని జగన్ ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు.
వారి సమస్యలను విన్న జగన్, పారిశుద్ధ్య కార్మికులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తమ హక్కుల కోసం పోరాటంలో తోడుగా నిలుస్తానని భరోసా ఇచ్చారు.