www.ntodaynews.com
జిందాల్ ప్లాంట్ను సందర్శించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్
/
పల్నాడు
జిందాల్ ప్లాంట్ను సందర్శించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
ఎడ్లపాడు మండలంలోని జిందాల్ వేస్ట్-టు-ఎనర్జీ (వ్యర్థాల నుండి విద్యుత్ తయారీ) ప్లాంట్ను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సందర్శించారు. ఈ సందర్భంగా ప్లాంట్లో చెత్తను విద్యుత్గా మార్చే సాంకేతిక ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయన, కంట్రోల్ రూమ్లో అధికారులతో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. చాలా కాలంగా పేరుకుపోయిన వ్యర్థాల ప్రాసెసింగ్ విధానం, పర్యావరణ పరిరక్షణ చర్యలతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయబోయే మరిన్ని ప్లాంట్ల ప్రగతిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.