BREAKING
బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన చిర్ల జగ్గిరెడ్డి చిత్తూరు లో నాణ్యతలేని అంగన్వాడి పాలు చిత్తూరు జిల్లా పరిధిలో యాదవ సంఘ నూతన కమిటీలు అధ్వానంగా మారిన నరిగపల్లి–తాళంబేడు రహదారి జగన్‌ను కలిసిన అమలాపురం కో-ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ తమ్మన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన చిర్ల జగ్గిరెడ్డి మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన చిర్ల జగ్గిరెడ్డి చిత్తూరు లో నాణ్యతలేని అంగన్వాడి పాలు చిత్తూరు జిల్లా పరిధిలో యాదవ సంఘ నూతన కమిటీలు అధ్వానంగా మారిన నరిగపల్లి–తాళంబేడు రహదారి జగన్‌ను కలిసిన అమలాపురం కో-ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ తమ్మన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన చిర్ల జగ్గిరెడ్డి మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU
www.ntodaynews.com

జల్ బోర్డు టెండర్ల కేసులో సత్యేందర్ జైన్ అరెస్ట్.. ఆప్‌లో కలకలం

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Aug, 2026 - 09:32 AM
22 వీక్షణలు

ఢిల్లీ: ఢిల్లీ జల్‌ బోర్డు టెండర్ల వ్యవహారంలో అవినీతి ఆరోపణలపై ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత, మాజీ మంత్రి సత్యేందర్ జైన్‌ను ఢిల్లీ అవినీతి నిరోధక శాఖ అదుపులోకి తీసుకుంది. మురుగునీటి శుద్ధి ప్లాంట్లకు సంబంధించిన పనుల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులో జైన్‌తో పాటు మరికొందరిని కూడా విచారిస్తున్నట్లు సమాచారం. గతంలోనూ మనీలాండరింగ్‌ కేసులో సత్యేందర్ జైన్ అరెస్ట్ అయి జైలు జీవితం గడిపారు. తాజా పరిణామాలతో ఢిల్లీ రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. అయితే ఈ అరెస్ట్‌ను ఆమ్‌ ఆద్మీ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఇది కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించి చేస్తున్న రాజకీయ కుట్ర అని ఆరోపించింది. ఆరోపణలు జరిగిన సమయంలో సత్యేందర్ జైన్ అధికార బాధ్యతల్లో లేరని, ఆయనను కావాలనే లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆప్ నేతలు పేర్కొన్నారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతుండగా, ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.