జలధార, జలభద్రత కార్యక్రమం లో భాగంగా ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది
జలధార, జలభద్రత కార్యక్రమం లో భాగంగా ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది
అన్నమయ్యాజిల్లా, చౌడేపల్లి మండల కార్యాలయాలపైన జిల్లా కలెక్టర్ కి పలు ఫిర్యాదులు వెళ్లడంతో బుధవారం ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది.జిల్లాలోనే అధికంగా చౌడేపల్లి మండలంలో తాగునీటి ట్యాంక్ లు అధికంగా ఉన్నాయని అందులో అధికమొత్తంలో ట్యాంక్ లకు నీరు సరఫరా అయ్యే , ఫీడర్ ఛానెల్స్ పెండింగ్ లో ఉన్నాయని ఫిర్యాదులు వచ్చాయని, అలాగే ప్రభుత్వం చెరువుల సరోవరం అనే కార్యక్రమం చేపట్టిందని చెరువులలో నీటి నిలవను చేసేవిధంగా చర్యలు చేపట్టాలని మండల అధికారులు MRO, MPDO లకు సూచించారు. చెరువులలో నీరు నిల్వ ఉంచడం వలన ఫిషరీ యూనిట్స్ పెంచడంలో ప్రభుత్వం కొత్త ప్రణాళికలు ప్రారంభిస్తుందని, చౌడేపల్లి మండలంలో ప్రజాసమస్యల పరిస్కార వేదిక లో సమస్యల పరిస్కారంలో జాప్యం జరుగుతుందని విచారణ చేస్తున్నామన్నారు. చౌడేపల్లి మండల అధికారులు తహసీల్దార్, MPDO ఇరిగేషన్ అధికారులు, చౌడేపల్లి పోలీస్ అధికారులు, పంచాయతీ అధికారులు పాల్గొన్నారు