BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

జలధార పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
17 Apr, 2026 - 07:43 PM
86 వీక్షణలు

మదనపల్లె: జలవనరుల అభివృద్ధి, రైతుల సంక్షేమం లక్ష్యంగా జిల్లాలో చేపడుతున్న జలధార–జలహారతి పనులను సమగ్ర ప్రణాళికతో, నాణ్యతతో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులకు స్పష్టం చేశారు. మదనపల్లెలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన వివిధ శాఖల అధికారులతో కలిసి పనుల పురోగతిని పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చెరువులు, వాగులు, కాలువల నీటి ప్రవాహ మార్గాలను పునరుద్ధరించడం అత్యంత కీలకమని అన్నారు. ఒక చెరువు నిండిన తర్వాత మరొక చెరువుకు నీరు సాఫీగా చేరే విధంగా సమగ్ర వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. దీని ద్వారా భూగర్భ జలాల స్థాయి పెరిగి, సాగునీటి లభ్యత మెరుగుపడుతుందని తెలిపారు.

పూడికతీత పనులను వేగవంతం చేయడంతో పాటు కాలువల శుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఎక్కడైనా ఆక్రమణలు ఉన్నచోట వాటిని తొలగించే చర్యలు తక్షణమే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ పనుల్లో నరేగా కార్మికులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు.

రైతులకు ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన కల్పించడం కూడా అంతే ముఖ్యమని కలెక్టర్ పేర్కొన్నారు. ముఖ్యంగా సూక్ష్మ సేద్యం, ఉద్యాన సాగు వంటి విధానాలను ప్రోత్సహించడం ద్వారా నీటి వినియోగాన్ని తగ్గిస్తూ అధిక దిగుబడులు సాధించవచ్చని వివరించారు.

జిల్లాలో జలవనరుల సంరక్షణ, వినియోగంలో సమన్వయం కల్పిస్తే రైతులకు దీర్ఘకాలిక లాభాలు చేకూరుతాయని కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు.