www.ntodaynews.com
జంగారెడ్డిగూడెం డీఎస్పీగా బి.హెచ్. వెంకటేశ్వర్లు బాధ్యతల స్వీకరణ
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
ఏలూరు జిల్లా, జూలై 22: జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ డీఎస్పీగా నియమితులైన బి.హెచ్. వెంకటేశ్వర్లు బుధవారం బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండే పోలీసింగ్కు కట్టుబడి పనిచేస్తామని చెప్పారు. నేరాల నియంత్రణ, మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణపై ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్నారు.
ప్రజలు పోలీసు శాఖకు సహకరించి నేరాల నియంత్రణలో భాగస్వాములు కావాలని కోరారు. సమస్యలు ఎదురైనప్పుడు నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని, ప్రతి ఫిర్యాదును చట్టబద్ధంగా, పారదర్శకంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని డీఎస్పీ బి.హెచ్. వెంకటేశ్వర్లు తెలిపారు.