www.ntodaynews.com
పేకాట స్థావరంపై పోలీసుల దాడులు
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
జంగారెడ్డిగూడెం ఇన్స్పెక్టర్ ఎం.వి. సుభాష్ ఆధ్వర్యంలో పోలీసులు పేకాట స్థావరంపై దాడులు
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం: తడికల పూడి మహిళా ఎస్ఐ వల్లి పద్మకి అందిన సమాచారంతో జిలకరగూడెం గ్రామ శివారులో ఉన్న పేకాట స్థావరంపై పోలీసుల బృహత్తర దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 5 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.5,700 నగదు, 2 సెల్ ఫోన్లు, 3 స్మార్ట్ఫోన్లు మరియు ఒక హీరో గ్లామర్ మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు పేకాట వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై కఠిన చర్యలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ప్రజలు ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. ఈ దాడిలో కానిస్టేబుళ్లు సుధీర్, అజయ్, నాగూర్, చంద్ర మౌళి పాల్గొన్నారు.