మెగా పెరెంట్స్ మీటింగ్ లో ఎమ్మెల్యే అసహనం
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం
తిరువూరు జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన మెగా పెరెంట్స్ మీటింగ్ లో తల్లిదండుల హాజరు శాతం తక్కువగా ఉండటంతో ఎమ్మెల్యే కొలిక పూడి శ్రీనివాసరావు కొంత అసహనం వ్యక్తం చేశారు.
పిల్లలపై బాధ్యత తల్లిదండ్రులకు లేకపోతే బయట వాళ్లకు మీ పై బాధ్యత ఎందుకు అవసరమని ప్రశ్నించారు. సంవత్సరంలో రెండుసార్లు నిర్వహించి పేరెంట్స్ మీటింగ్ కు తల్లిదండ్రులు రాకపోతే విద్యార్థుల పట్ల బాధ్యత ఎలా ఉంటుందని అన్నారు.
ఈ సందర్భంగా
ఎమ్మెల్యే విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి వారు భవిష్యత్తులో ఏమి కావా లనుకుంటున్నారో అడిగి తెలుసుకుని దాని సాధన కోసం తీసుకోవాల్సిన విధి విధానాలను వివరించారు.
ఈ కార్యక్రమంలో డివైఈవో శ్యాంసుందర్ తహసిల్దార్ చంద్రమౌళి,ప్రధానోపాధ్యాయురాలు మృదుల తదితరులు పాల్గొన్నారు.