చింతల భాస్కర రెడ్డి పార్థివ దేహానికి వైసీపీ నేతల నివాళి
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలం నరసాపురం గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు, విశ్రాంత ఉపాధ్యాయుడు చింతల భాస్కర రెడ్డి పార్థివ దేహానికి తిరువూరు మాజీ శాసనసభ్యుడు, వైసీపీ సీనియర్ నేత నల్లగట్ల స్వామిదాస్తో పాటు మద్దిరెడ్డి సూర్యనారాయణ రెడ్డి, దేశిరెడ్డి రాఘవరెడ్డి, అల్లు గణపతి రెడ్డి, సిరసాని ప్రకాష్ రావు, తాణంకి రాంబాబు తదితరులు నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ చింతల భాస్కర రెడ్డి ఉపాధ్యాయుడిగా అనేక మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంతో పాటు ప్రజా సేవకు అంకితభావంతో పనిచేశారని కొనియాడారు. గ్రామ అభివృద్ధి, సామాజిక సేవ, పార్టీ బలోపేతానికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. నిరాడంబర జీవనం, నిబద్ధత, సేవా తపనతో ప్రజల మన్ననలు పొందిన వ్యక్తిగా భాస్కర రెడ్డి ఎప్పటికీ గుర్తుండిపోతారని అన్నారు.
ఆయన మృతి నరసాపురం గ్రామానికే కాకుండా తిరువూరు నియోజకవర్గానికి తీరని లోటని పేర్కొంటూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం పార్థివ దేహంపై పూలమాలలు ఉంచి ఘనంగా నివాళులు అర్పించి, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.