BREAKING
పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి
www.ntodaynews.com

పెనుగొలను బీసీ పాఠశాలలో ఘనంగా గుర్రం జాషువా వర్ధంతి నిర్వహణ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Jul, 2026 - 10:44 AM
29 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలోని ప్రాథమిక బీసీ పాఠశాలలో శుక్రవారం శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో నవయుగ చక్రవర్తి గుర్రం జాషువా వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ఆయన సాహిత్య సేవలను స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వి. అనూష మాట్లాడుతూ, సామాజిక వివక్షను ఎదుర్కొన్నప్పటికీ గుర్రం జాషువా తన కవిత్వాన్ని సమాజ చైతన్యానికి ఆయుధంగా మలిచారని పేర్కొన్నారు. మూఢనమ్మకాలపై ధైర్యంగా పోరాడి, ఒకప్పుడు అవమానాలు ఎదుర్కొన్న చోటే అనంతరం గౌరవాలు అందుకున్న మహనీయుడిగా నిలిచారని కొనియాడారు.

జాషువా రచించిన 'గబ్బిలం', 'ఫిరదౌసి', 'క్రీస్తు చరిత్ర' వంటి రచనలు తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచాయని తెలిపారు. అలాగే 'సత్య హరిశ్చంద్ర' నాటకంలోని కాటిసీను పద్యాలు నేటికీ ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుని తెలుగు నాటక రంగంలో మార్మోగుతున్నాయని వివరించారు.

శిరిడి సాయిబాబా సేవా కమిటీ అధ్యక్షుడు వూటుకూరు నారాయణరావు మాట్లాడుతూ, గుర్రం జాషువాకు కవి కోకిల, నవయుగ చక్రవర్తి, కవితా విశారద, మధుర శ్రీనాథ వంటి బిరుదులతో పాటు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, పద్మభూషణ్ వంటి గౌరవాలు లభించాయని గుర్తుచేశారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు జి. లక్ష్మి, విద్యార్థులు, సేవా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.