పోచమ్మ తల్లి దేవాలయ నూతన నిర్మాణానికి భూమి పూజ..
పోచమ్మ తల్లి దేవాలయ నూతన నిర్మాణానికి భూమి పూజ..
మంచిర్యాల నియోజకవర్గం..
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 38వ డివిజన్ లో చెరువు కట్ట వద్ద పోచమ్మ తల్లి దేవాలయ నూతన నిర్మాణం కోసం నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని, పోచమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.
అనంతరం సురేఖమ్మ గారిని స్థానిక కార్పొరేటర్ పూదరి విజయలక్ష్మి–తిరుపతి శాలువాతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య–మహేష్, మంచిర్యాల కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్ తూముల నరేష్, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, టీపీసీసీ సభ్యులు, నస్పూర్ పట్టణ ఇంఛార్జి నూకల రమేష్, కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు, డివిజన్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు..