BREAKING
వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు దేశభక్తి, ధైర్యసాహసాలకు ప్రతీక అల్లూరి సీతారామరాజు – బొండా ఉమా పర్యావరణ పరిరక్షణపై అవగాహన ర్యాలీలో పాల్గొన్న జిల్లా విద్యాశాఖాధికారి ఆధార్ యాప్‌లోనే వివరాలు అప్‌డేట్ వాట్సాప్‌లో ఈ లింక్స్‌పై అస్సలు క్లిక్ చేయొద్దు 32 టన్నుల ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ బియ్యం స్వాధీనం – ఐదుగురు నిందితుల అరెస్ట్ ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్ - ఇకపై ఆ 3వేలు కట్టక్కర్లేదు బాచుపల్లిలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.. కొలను హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన నూతన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు దేశభక్తి, ధైర్యసాహసాలకు ప్రతీక అల్లూరి సీతారామరాజు – బొండా ఉమా పర్యావరణ పరిరక్షణపై అవగాహన ర్యాలీలో పాల్గొన్న జిల్లా విద్యాశాఖాధికారి ఆధార్ యాప్‌లోనే వివరాలు అప్‌డేట్ వాట్సాప్‌లో ఈ లింక్స్‌పై అస్సలు క్లిక్ చేయొద్దు 32 టన్నుల ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ బియ్యం స్వాధీనం – ఐదుగురు నిందితుల అరెస్ట్ ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్ - ఇకపై ఆ 3వేలు కట్టక్కర్లేదు బాచుపల్లిలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.. కొలను హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన నూతన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు
www.ntodaynews.com

జంజీరాల రాజం ప్రథమ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
17 May, 2026 - 05:00 PM
67 వీక్షణలు

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని 51వ డివిజన్ లక్ష్మీనగర్ కాలనీలో కీర్తిశేషులు జంజీరాల రాజం గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా తెలంగాణ ఉద్యమ కారుల ఐక్య వేదిక, శ్రీ భక్త మార్కండేయ పద్మశాలి స్వచ్ఛంద సేవా సంస్థ మరియు బీసీ సంఘాల ఆధ్వర్యంలో సంతాప సభ నిర్వహించారు.

బెల్లంపల్లి మండలం చెంద్రవెల్లి గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్‌గా, బెల్లంపల్లి మున్సిపాలిటీ 13వ వార్డు బాబుక్యాంప్ బస్తీ కౌన్సిలర్‌గా, కాంగ్రెస్ పార్టీ పట్టణ నాయకుడిగా, పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా, తెలంగాణ తొలి దశ మరియు మలి దశ ఉద్యమ కారుడిగా ప్రజలకు విశేష సేవలు అందించిన జంజీరాల రాజం గారిని ఈ సందర్భంగా నాయకులు స్మరించుకున్నారు.

సభలో అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య మాట్లాడుతూ జంజీరాల రాజం గారి మరణం బెల్లంపల్లి పట్టణానికి తీరని లోటని, ఆయన చేసిన ప్రజాసేవలు చిరస్మరణీయమని కొనియాడారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా “జంజీరాల రాజం అమర్ హై”, “జోహార్ జంజీరాల రాజం” అంటూ నాయకులు నినాదాలు చేశారు.

ఈ కార్యక్రమంలో గజెల్లి వెంకటయ్య, జి. లక్ష్మణ్, సిహెచ్ శ్రీనివాస్, టీ. మల్లేష్, సాంబమూర్తి, పి. తిరుపతి, గోపన్న, అన్వర్, డి. కిషన్ సింగ్, ఏ. రాజేశం, జంజీరాల నారాయణ, శ్రీరాములు రవి తదితరులు పాల్గొన్నారు.