BREAKING
పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు
www.ntodaynews.com

జంజీరాల రాజం ప్రథమ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
17 May, 2026 - 05:00 PM
103 వీక్షణలు

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని 51వ డివిజన్ లక్ష్మీనగర్ కాలనీలో కీర్తిశేషులు జంజీరాల రాజం గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా తెలంగాణ ఉద్యమ కారుల ఐక్య వేదిక, శ్రీ భక్త మార్కండేయ పద్మశాలి స్వచ్ఛంద సేవా సంస్థ మరియు బీసీ సంఘాల ఆధ్వర్యంలో సంతాప సభ నిర్వహించారు.

బెల్లంపల్లి మండలం చెంద్రవెల్లి గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్‌గా, బెల్లంపల్లి మున్సిపాలిటీ 13వ వార్డు బాబుక్యాంప్ బస్తీ కౌన్సిలర్‌గా, కాంగ్రెస్ పార్టీ పట్టణ నాయకుడిగా, పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా, తెలంగాణ తొలి దశ మరియు మలి దశ ఉద్యమ కారుడిగా ప్రజలకు విశేష సేవలు అందించిన జంజీరాల రాజం గారిని ఈ సందర్భంగా నాయకులు స్మరించుకున్నారు.

సభలో అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య మాట్లాడుతూ జంజీరాల రాజం గారి మరణం బెల్లంపల్లి పట్టణానికి తీరని లోటని, ఆయన చేసిన ప్రజాసేవలు చిరస్మరణీయమని కొనియాడారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా “జంజీరాల రాజం అమర్ హై”, “జోహార్ జంజీరాల రాజం” అంటూ నాయకులు నినాదాలు చేశారు.

ఈ కార్యక్రమంలో గజెల్లి వెంకటయ్య, జి. లక్ష్మణ్, సిహెచ్ శ్రీనివాస్, టీ. మల్లేష్, సాంబమూర్తి, పి. తిరుపతి, గోపన్న, అన్వర్, డి. కిషన్ సింగ్, ఏ. రాజేశం, జంజీరాల నారాయణ, శ్రీరాములు రవి తదితరులు పాల్గొన్నారు.