www.ntodaynews.com
జంపింగ్లకు తావులేదు.. యువతకు అవకాశం: మమతా బెనర్జీ
జాతీయం
జంపింగ్లకు తావులేదు.. యువతకు అవకాశం: మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ పార్టీని వీడి వెళ్లిన నేతలను తిరిగి చేర్చుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కోల్కతాలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ పార్టీని విడిచి వెళ్లేవారు నేరుగా బీజేపీలో చేరి ఎన్నికల్లో పోటీ చేయాలని సవాల్ విసిరారు.
"ఎంత ఎక్కువ మంది పార్టీని వీడితే నాకు అంత సంతోషం. ఖాళీ అయ్యే స్థానాలను యువ నాయకులతో భర్తీ చేస్తాం. పార్టీకి విధేయంగా పనిచేసే వారికి ప్రాధాన్యం ఉంటుంది" అని మమతా బెనర్జీ పేర్కొన్నారు.