జనార్ధనవరంలో వీబీజీ రామ్జీ ఉపాధి పనులకు శ్రీకారం
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం జనార్ధనవరం గ్రామంలో వికసిత్ భారత్ గారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ (వీబీజీ రామ్జీ) ఉపాధి పథకం పనులకు గురువారం శ్రీకారం చుట్టారు.
గ్రామ టీడీపీ అధ్యక్షుడు మదాసు చిన్నపుల్లయ్య ఆదేశాల మేరకు, ఆయన అందుబాటులో లేకపోవడంతో గ్రామ నీటి సంఘం అధ్యక్షుడు వంగల సుబ్బారావు భూమిపూజ నిర్వహించి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో గ్రామీణ కూలీలకు ఒక్కొక్కరికీ 125 రోజుల ఉపాధి కల్పించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. గ్రామ ప్రజలు, కూలీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉపాధి పొందాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ ప్రధాన కార్యదర్శి బలువూరి రత్తయ్య, గ్రామ కోశాధికారి కాసగాని గోపాలస్వామి, గ్రామ పంచాయతీ కార్యదర్శి హనుమంతురావు, గ్రామ కూలీలు పాల్గొన్నారు.