జనసేన జిల్లా కార్యదర్శి పగడాల రమణ గర్జన
జనసేన జిల్లా కార్యదర్శి పగడాల రమణ గర్జన
జనసేన పార్టీ కార్యాలయంలో అన్నమయ్య జిల్లా కార్యదర్శి పగడాల రమణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. శనివారం ఆయన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని ఎన్.డి.ఎ.ఐ యత్వం దేశంలోని 72 కోట్ల మంది మహిళల సాధికారక కోసం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ పార్టీ అడ్డుకోవడం అత్యంత దురదృష్టకరమని పగడాల రమణ ధ్వజమెత్తారు. ఈ దర్య భారతీయ మహిళా లోకాన్ని అవమానించడమేనని, దేశ చరిత్రలో ఇదొక చీకటి రోజుగా
నిలిచిపోతుందని ఆయన మండిపడ్డారు. పగడాల రమణ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుంటే, మహిళల అభ్యున్నతిని. చూసి జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. గత 12 ఏళ్లుగా ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ, ఇలాంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో తన గోతిని తానే తవ్వుకుంటోందని హెచ్చరించారు. 2019లోనే జనసేనాని పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ కాహరాదే- దేశ్ కో బరావో అని ఇచ్చిన పిలుపు నేటికీ అక్షర" ఎత్యమని ఆయన గుర్తు చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న కాంగ్రెస్ పార్టీని రాబోయే రోజుల్లో ప్రజలే తరిమి కొడతారని, భవిష్యత్తులో ఆ పార్టీకి కనీసం డిపాజిట్లు కూడా రావు
మీడియాతో మాట్లాడుతున్న పగడాల రమణ
చక్కవని సగజాల రమణ ఘాటుగా విమర్శించారు. పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా, మహిళా సాధికారత కోసం తాము నిరంతరం శ్రమిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన టౌన్ ఉపాధ్యక్షులు నందు సంబేపల్లి. వండురాయల్, గెనె, శ్రీనివాసులు, జగదీష్, రవికుమార్, కిరణ్ కుమార్, వీర మహిళలు తదితరులు పాల్గొని గాంగ్రెస్ పార్టీ తీరును ముక్తకంఠంతో ఖండించారు.