www.ntodaynews.com
జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు
ఆంధ్రప్రదేశ్
/
పల్నాడు
అమరావతి:
జనసేన పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ పేరును పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. గురువారం జరిగిన కూటమి నేతల సమావేశంలో రాజ్యసభ స్థానాల కేటాయింపుపై చర్చించి, జనసేనకు ఒక సీటు, టీడీపీకి మూడు సీట్లు కేటాయించాలని నిర్ణయించారు.
ఈ నేపథ్యంలో జనసేనకు దక్కిన రాజ్యసభ స్థానానికి లింగమనేని రమేష్ పేరును పార్టీ అధ్యక్షుడు Pawan Kalyan అధికారికంగా ప్రకటించారు.
రాజ్యసభ అభ్యర్థి ఎంపికపై కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి అనుగుణంగానే, మొదటి నుంచి వినిపించిన లింగమనేని రమేష్ పేరునే పార్టీ ఖరారు చేసింది. దీంతో ఆయన త్వరలో నామినేషన్ దాఖలు చేయనున్నారు.
కూటమి తరఫున రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తికావడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.