రిజిస్ట్రేషన్ శాఖ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా దస్తావేజు లేఖరుల ఆందోళన
రిజిస్ట్రేషన్ శాఖ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా దస్తావేజు లేఖరుల ఆందోళన
అన్నమయ్య జిల్లా. పుంగనూరు
రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖను ప్రైవేటీకరణ చేస్తూ G.O.Ms.No.396. ను విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజు లేఖరులు, వారి సహాయకులు డి.టి.పి. ఆపరేటర్లు, స్టాంప్ వేండర్స్ అందరూ నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా రాష్ట్ర దస్తావేజు లేఖరుల సంఘం వారి పిలుపు, సూచనల మేరకు ఈ రోజు అనగా 20_07_2026 వ తేదీ మొదలు 31-07-2026 వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పెన్ డౌన్ కార్యక్రమాలు చేయాలని నిర్ణయించారు అందులో భాగంగా అన్నమయ్య జిల్లా పుంగనూరు దస్తావేజు లేఖరుల సంఘం వారు ఈ రోజు అనగా 21/7/2026. వ తేదీ మంగళవారం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఆవరణంలో 2 రెండవ రోజు పెన్ డౌన్ కార్యక్రమము నిర్వహించారు.
ఈ వార్తను మీరు మీ మీడియా ద్వారా ప్రచురించి మాకు సహకరించవలసినదిగా కోరుచున్నాము. ఈ కార్యక్రమము లో దస్తావేజు లేఖరుల సంఘం ప్రతినిధులు శ్రీ.
కే. రామమూర్తి, పి.త్యాగరాజు, పవనకుమార్ కే.మునిరాజాచారి, పి.పవన్ కుమార్, ఖలీల్, రవిచంద్ర రాజు, జ్యోతి, జి.చంద్రశేఖర్, హరి, కుమార్, జి.మురళి, కృష్ణవేణి, శిల్ప, ఖలీల్ గణేష్, సాదిక్,మొదలగు వారు పాల్గొన్నారు....