BREAKING
సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత
www.ntodaynews.com

అమెరికా ఫ్రీ ట్రేడ్ ఒప్పందానికి వ్యతిరేకంగా జూలై 22న దేశవ్యాప్త ఆందోళన: హరినాథ్

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Jul, 2026 - 07:57 PM
70 వీక్షణలు

అమెరికా ఫ్రీ ట్రేడ్ ఒప్పందానికి వ్యతిరేకంగా జూలై 22న దేశవ్యాప్త ఆందోళన: హరినాథ్

విస్సన్నపేట, జూలై 21: అమెరికాతో ప్రతిపాదిత ఫ్రీ ట్రేడ్ ఒప్పందం దేశ వ్యవసాయ రంగానికి తీవ్ర నష్టం కలిగిస్తుందని, అలాంటి ఒప్పందంపై కేంద్ర ప్రభుత్వం సంతకం చేయవద్దని డిమాండ్ చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు జూలై 22న దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నట్లు అఖిల భారత కిసాన్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి డి. హరినాథ్ తెలిపారు.

ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విజయవాడ ధర్నా చౌక్‌లో ఉదయం 10 గంటలకు ధర్నా చేపడతామని చెప్పారు. గ్రామ గ్రామాన సంతకాల సేకరణ చేపట్టి, అమెరికా ఫ్రీ ట్రేడ్ ఒప్పందంపై సంతకం చేయవద్దని కోరుతూ భారత రాష్ట్రపతికి విజ్ఞాపన పత్రాలు పంపుతున్నట్లు తెలిపారు.

జూలై 22న అన్ని మండల కేంద్రాల్లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చిందని పేర్కొన్నారు. అలాగే జూలై 28, 29 తేదీల్లో ఢిల్లీలో రైతు, కార్మిక సంఘాల సంయుక్త సమావేశం జరిగి భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తుందని వెల్లడించారు.

స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం సీ2+50 శాతం ఆధారంగా కనీస మద్దతు ధర అమలు చేయాలని డిమాండ్ చేశారు. మొక్కజొన్న, పత్తి, పొగాకు, టమాటా, మామిడి, కోకో, రొయ్యల రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారని, వారికి గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. అప్పుల్లో ఉన్న రైతులకు రుణమాఫీ చేయడంతో పాటు, 60 సంవత్సరాలు దాటిన సన్నకారు, చిన్న, మధ్యతరగతి, కౌలు రైతులందరికీ నెలకు రూ.10,000 రైతు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో అమెరికా ఫ్రీ ట్రేడ్ ఒప్పందంపై విస్తృత చర్చ జరిపి, రైతాంగ ప్రయోజనాలను కాపాడే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని హరినాథ్ కోరారు.