మంత్రి హోదాతో నియోజకవర్గం మరింత అభివృద్ధి : బెల్లి సత్తయ్య ధీమా
మంత్రి హోదాతో నియోజకవర్గం మరింత అభివృద్ధి : బెల్లి సత్తయ్య ధీమా
నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశంకు మంత్రి హోదాతో నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని చిట్యాల మున్సిపాలిటీ కో ఆప్షన్ సభ్యులు బెల్లి సత్తయ్య ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా (మంత్రి హోదా) కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల చిట్యాల పురపాలక సంఘం కో-ఆప్షన్ సభ్యులు బెల్లి సత్తయ్య హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి అహర్నిశలు శ్రమిస్తున్న ఎమ్మెల్యే వేముల వీరేశం సేవలను గుర్తించి ప్రభుత్వం ఈ గౌరవాన్ని అందించడం అభినందనీయమన్నారు. వీరేశంకు మంత్రి హోదా లభించడం వల్ల నకిరేకల్ నియోజకవర్గంతో పాటు చిట్యాల పురపాలక సంఘం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వీరేశంకు ఈ ఉన్నత స్థానాన్ని కల్పించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా బెల్లి సత్తయ్య ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ నిర్ణయం పట్ల నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.