BREAKING
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ
Date of Publish : 31 August 2026, 07:13 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

జయపురంలో టీడీపీ సీనియర్ నేత కొల్లి వరప్రసాద్ రావుకు ఘన నివాళులు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
31 Aug, 2026 - 07:13 PM
54 వీక్షణలు

ఏలూరు జిల్లా, చాట్రాయి మండలం:

చాట్రాయి మండలం తుమ్మగూడెం శివారు జయపురం గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మండల పార్టీ అధ్యక్షులు కొల్లి వరప్రసాద్ రావు మృతదేహానికి టీడీపీ, బీజేపీ నాయకులు ఘన నివాళులు అర్పించారు.

కొల్లి వరప్రసాద్ రావు పార్థివ దేహానికి చాట్రాయి టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు ఇజ్జిగాని వెంకటేశ్వరరావు, సీనియర్ నాయకులు మందపాటి బసవారెడ్డి, మాదాసు చిన్న పుల్లయ్య, కాపా శ్రీనివాస్ రావు, బీజేపీ నేత నెక్కలపు వెంకటేశ్వరరావు తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఇజ్జిగాని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. కొల్లి వరప్రసాద్ రావు పార్టీకి అందించిన సేవలు మరువలేనివని అన్నారు. కష్టకాలంలో కూడా పార్టీకి అండగా నిలిచి, కార్యకర్తలకు మార్గనిర్దేశం చేసిన నాయకుడిగా ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారని పేర్కొన్నారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మందపాటి బసవారెడ్డి మాట్లాడుతూ.. వరప్రసాద్ రావు క్రమశిక్షణ కలిగిన నాయకుడని, గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశారని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ ముందుండే వ్యక్తిగా ఆయన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.

నెక్కలపు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. కొల్లి వరప్రసాద్ రావు రాజకీయాల్లో విలువలు పాటించిన నాయకుడని, ప్రజలతో మమేకమై పనిచేసిన మంచి వ్యక్తి అని అన్నారు.

కాపా శ్రీనివాస్ రావు, మాదాసు చిన్న పుల్లయ్య మాట్లాడుతూ.. కొల్లి వరప్రసాద్ రావు సేవలను స్మరించుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొని కొల్లి వరప్రసాద్ రావుకు నివాళులు అర్పించారు.