www.ntodaynews.com
మహిళల ఉత్సాహంతో కళకళలాడిన జియాపల్లి
తెలంగాణ
లక్ష్మి నారాయణ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ కార్యక్రమం
మహిళల ఉత్సాహంతో కళకళలాడిన జియాపల్లి NTODAY NEWS: బీబీనగర్ ప్రతినిధి: బాల్ద. భాస్కర్ కురుమ బీబీనగర్ మండలం జియాపల్లి గ్రామంలో లక్ష్మి నారాయణ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఈ పోటీలో పాల్గొన్న మహిళలందరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. అనివార్య కారణాల వల్ల ముఖ్య అతిథులుగా హాజరు కావాల్సిన తెలంగాణ రాష్ట్ర నాయకురాలు కుంభం కీర్తి రెడ్డి మరియు బీబీనగర్ మండల మాజీ ఎంపీపీ గోలి ప్రణిత పింగళి రెడ్డి కార్యక్రమానికి ప్రత్యక్షంగా హాజరు కాలేకపోయారు. అయితే వీడియో కాల్ ద్వారా మహిళలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, పోటీలో విజేతలుగా నిలిచిన వారికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారిద్దరికీ నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జియాపల్లి మాజీ ఎంపీటీసీ మన్నే బాలరాజు, మన్నే సుమలత, గ్రామశాఖ అధ్యక్షుడు ఎండీ అన్వార్ బెగ్, 7వ వార్డు సభ్యుడు మన్నే రఘునాకర్, యూత్ అధ్యక్షుడు సాయినాథ్ గౌడ్తో పాటు జియాపల్లి గ్రామ యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
#MuggulaCompetition
#SankrantiCelebrations
#WomenEmpowerment
#CulturalTraditions
#BBNagar
#Jiapalli
#LocalNews
#NtodayNews
Follow us on
Website
Facebook
Instagram
YouTube 