www.ntodaynews.com
ప్రతి మండలంలో జాబ్ కార్డులు జారీ చేయాలి
తెలంగాణ
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రతి మండలంలో జాబ్ కార్డులు జారీ చేయాలి: జిల్లా కలెక్టర్
NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసి, పూర్తిచేసిన లబ్ధిదారులకు జాబ్ కార్డులు తప్పనిసరిగా జారీ చేయాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు సంబంధిత అధికారులకు ఆదేశించారు.
మంగళవారం మినీ మీటింగ్ హాల్లో ఎంపీడీవోలు, ఎంపీఓలు, హౌసింగ్ సిబ్బందితో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై మండలాల వారీగా వివరాలు సేకరించారు.
ఇందిరమ్మ ఇండ్లు పూర్తిచేసిన లబ్ధిదారులకు ఉపాధి హామీ పథకం కింద జాబ్ కార్డులు అందించడంతో పాటు, 90 రోజుల పని దినాలకు చెల్లింపులు ఎలాంటి ఆలస్యం లేకుండా జరిగాయా అనే విషయాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అలాగే వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణం పూర్తిచేసిన వారికి రూ.12,000 చెల్లింపులు చేయాలని ఆదేశించారు. ప్రతి మండలంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులందరికీ జాబ్ కార్డులు అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి, భువనగిరి రెవిన్యూ డివిజనల్ అధికారి కృష్ణారెడ్డి, హౌసింగ్ పీడీ విజయసింగ్, శ్రీరాములు, ఎంపీడీవోలు, ఏపీవోలు మరియు ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
#IndirammaHouses #JobCards #MGNREGS #RuralDevelopment #YadadriBhuvanagiri
Follow us on
Website
Facebook
Instagram
YouTube