www.ntodaynews.com
శ్రీనివాస టౌన్ షిప్ వెంచర్ బాధితులకు న్యాయం చేయాలి
తెలంగాణ
శ్రీనివాస టౌన్ షిప్ వెంచర్ బాధితులకు న్యాయం చేయాలి అంటూ ఫిర్యాదు
NTODAY NEWS: రిపోర్టర్ కూనూరు మధు
నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపల్ పరిధిలోని శ్రీనివాస టౌన్ షిప్ వెంచర్ లో ఓపెన్ ప్లాట్ల కోసం డబ్బులు చెల్లించిన బాధితులకి న్యాయం కోరుతూ చిట్యాల పోలీస్ స్టేషన్లో దాదాపు 15 మంది బాధితులు నిర్వాహకులపై ఫిర్యాదు చేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం వెంచర్ ఓనర్లు అయిన బొబ్బిలి జితెందర్ రెడ్డి, అర్ధ వెంకటరెడ్డి, కొణతం శివశంకర్, S S డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్ పాకాల తిరుపతి రెడ్డి కలిసి బ్రోచర్ విడుదల చేసి ఓపెన్ ప్లాట్లను మార్కెట్లో అమ్మకానికి పెట్టడం జరిగింది. అప్పుడు కొంతమంది కస్టమర్స్ అట్టీ ఓపెన్ ప్లాట్లు ఖరీదు చేసుకొని అడ్వాన్స్ చెల్లించి డెవలపర్ తో అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. కానీ అనంతరం కస్టమర్స్ కి అగ్రిమెంట్ చేసిన ప్లాట్లను అధిక ధరలకు ఆశపడి సదరు వెంచర్ బాధ్యులు ఇతరులకు అమ్మి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. బాధితులు ఎన్నిసార్లు వెంచర్ బాధ్యులను సంప్రదించినా కూడా ఏదో ఒక రకంగా దాటవేస్తూ ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయకుండా లేదా చెల్లించిన డబ్బులు తిరిగి ఇవ్వకుండా మోసం చేస్తూ చివరకు ఓనర్లు డెవలపర్ మీద డెవలపర్ ఓనర్ల మీద నెపం వేస్తూ బాధితులను తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఫిర్యాదు చేసిన వారిలో బత్తుల జనార్దన్, లింగస్వామి అయిలయ్య పాల్గొన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube