ఎన్డీఏ కూటమి రెండేళ్లు పూర్తి: నూజివీడు బైక్ ర్యాలీలో పోలవరం టీడీపీ శ్రేణుల హల్చల్
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పోలవరం గ్రామం నుంచి నూజివీడు వరకు ఎన్డీఏ కూటమి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన బైక్ ర్యాలీలో టీడీపీ శ్రేణులు భారీగా పాల్గొన్నారు. నూజివీడు యర్ర శ్రీనివాసరావు, పెదరాయుడు, మరిడి అప్పారావు, చాగంటి నరసింహారావు యర్రా హేమంత్ కుమార్ తదితరులు పార్టీ కుటుంబ సభ్యులతో కలిసి ర్యాలీలో పాల్గొని సందడి చేశారు.
నూజివీడు శాసనసభ్యులు, మంత్రి కొలుసు పార్థసారధి పిలుపు మేరకు ఈ బైక్ ర్యాలీ నిర్వహించబడింది. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగిన ర్యాలీకి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున స్పందన చూపించారు.
ఈ సందర్భంగా పెదరాయుడు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి పాలనలో అభివృద్ధి పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయని, గ్రామీణ ప్రాంతాల్లో సంక్షేమ పథకాలు మరింత బలంగా అమలవుతున్నాయని తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రజా మద్దతుతో కూటమి మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.