www.ntodaynews.com
కాకినాడ జిల్లాలో ‘గ్రేటర్ ఫ్లెమింగోల’ సందడి
ఆంధ్రప్రదేశ్
/
కాకినాడ
కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలం కోరింగ అభయారణ్యం (Coringa Wildlife Sanctuary) పరిధిలోని హోప్ ఐలాండ్ సముద్ర మొగ వద్ద వలస పక్షులైన గ్రేటర్ ఫ్లెమింగోలు సందడి చేశాయి.
బోటు షికారుకు వెళ్లిన పర్యాటకులకు ఫ్లెమింగోల గుంపు కనిపించడంతో వారు ఆనందం వ్యక్తం చేశారు. పక్షుల అందాలను ఫోటోలు తీసుకుంటూ ఆ ప్రదేశాన్ని ఆస్వాదించారు.
అభయారణ్యంలో సుమారు 30 నుండి 32 ఫ్లెమింగోల గుంపు గుర్తించినట్లు ఫారెస్ట్ రేంజర్ ఎస్ఎస్ఆర్ వర ప్రసాద్ తెలిపారు. గత ఏడాది కేవలం ఒక ఫ్లెమింగో మాత్రమే కనిపించగా, ఈ ఏడాది జనవరిలో 70 వరకు కనిపించాయని, ప్రస్తుతం 32 పక్షులు రావడం శుభపరిణామమని పేర్కొన్నారు.
కోరింగ అభయారణ్యంలో ఉన్న చిత్తడి నేలలు వలస పక్షులకు అనుకూలంగా ఉండటంతో ఫ్లెమింగోలు సహా ఇతర పక్షి జాతులు కూడా తరలి వస్తున్నాయని అధికారులు తెలిపారు.