కాల్చొద్దు భూసారానికి తీవ్ర నష్టం
కాల్చొద్దు భూసారానికి తీవ్ర నష్టం : వ్యవసాయ అధికారి గిరిబాబు NTODAY NEWS చిట్యాల
వరి కోతల తర్వాత పొలాల్లోని కొయ్యలు, గడ్డిని తగలబెట్టడం పర్యావరణానికి, భూసారానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని మండల వ్యవసాయ అధికారి పగిడిమర్రి గిరిబాబు హెచ్చరించారు. రైతులు ఈ చర్యను వెంటనే నిలిపివేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వరి కొయ్యలను కాల్చడం వల్ల మట్టిలోని తేమ ఆవిరైపోతుంది, మిత్రపురుగులు నశిస్తాయి, మరియు మట్టి గట్టిపడి దున్నడం కష్టమవుతుంది. పొగ, బూడిద వల్ల వాతావరణ కాలుష్యం పెరుగుతుంది.
ప్రత్యామ్నాయాలు: వరి కొయ్యలను చిన్న ముక్కలుగా చేసి, డీకంపోజర్ లేదా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ సాయంతో భూమిలో కలిపి దున్నితే అది సేంద్రియ ఎరువుగా మారుతుంది. అని అన్నారు. వరికోయ్యలను వీటిని పశువుల మేత, వర్మి కంపోస్ట్, బయోగ్యాస్, పుట్టగొడుగుల (మష్రూమ్) సాగు, పేపర్ మరియు బయో ఇంధన తయారీలో ఉపయోగించవచ్చు.
వరి కొయ్యలను తగలబెట్టడం చట్టరీత్యా నేరమని, రైతులు ఈ విధానాన్ని మానుకొని భూసారాన్ని రక్షించుకోవాలని ఆయన కోరారు.