BREAKING
పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు
www.ntodaynews.com

​కాంగ్రెస్ రాజ్యసభ సీటును అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధం: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
10 Jun, 2026 - 01:48 PM
128 వీక్షణలు

  • బీజేపీ, ఈసీఐ కుమ్మక్కై ‘ఓటు చోరీ’కి పాల్పడుతున్నాయి
  • ​రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వం

​మధ్యప్రదేశ్ రాష్ట్రం నుండి కాంగ్రెస్ పార్టీకి దక్కాల్సిన రాజ్యసభ స్థానాన్ని సాంకేతిక కారణాలు చూపుతూ అడ్డుకోవడం ముమ్మాటికీ ప్రజాస్వామ్య విరుద్ధమని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ, ఎన్నికల సంఘం కలిసి చేస్తున్న కుంభకోణాల వల్లే ఇటువంటి అన్యాయాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గారు దేశంలో జరుగుతున్న ‘ఓటు చోరీ’ పై నిరంతరం పోరాడుతున్నారని, అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా కల్పించిన పవిత్రమైన హక్కులను దొంగిలించి భారతీయ జనతా పార్టీ నాయకులు దొడ్డిదారిన అధికారంలో కూర్చుంటున్నారని విమర్శించారు.

​గతంలో ఎన్నికల సంఘం, భారతీయ జనతా పార్టీలు కుమ్మక్కై నామినేషన్ల పరిశీలన నివేదిక పేరుతో ఏ విధంగా అక్రమాలకు పాల్పడ్డారో, ఇప్పుడు మధ్యప్రదేశ్‌లో అదే పునరావృతం చేశారని ధ్వజమెత్తారు. అక్కడ కాంగ్రెస్ తరఫున రాజ్యసభ బరిలో నిలిచిన తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ గారి నామినేషన్‌లో కావాలనే తప్పులున్నాయనే నెపంతో తిరస్కరించడం వారి కుట్రకు నిదర్శనమని ఆరోపించారు. హక్కు ప్రకారం కాంగ్రెస్‌కు రావాల్సిన సీటును అడ్డుకుని, తిరిగి భారతీయ జనతా పార్టీకే దక్కేలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ఎంపీ వంశీకృష్ణ ప్రశ్నించారు