www.ntodaynews.com
కారు ఢీకొని సింగరేణి కార్మికుడు దుర్మరణం
తెలంగాణ
/
మంచిర్యాల
/
మంచిర్యాల
కారు ఢీకొని సింగరేణి కార్మికుడు దుర్మరణం – భార్య, కుమారుడికి తీవ్ర గాయాలు
హాజీపూర్ మండలం వేంపల్లి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సింగరేణి కార్మికుడు రమేష్ (35) మృతి చెందారు. దీనబంద గ్రామానికి చెందిన రమేష్, సిసిసి నస్పూర్లో నివాసం ఉంటుూ సింగరేణిలో వారసత్వ ఉద్యోగం చేస్తున్నారు. స్వగ్రామంలో కుటుంబ సభ్యుల కర్మ కార్యక్రమానికి హాజరై, తన భార్య రజిత మరియు కుమారుడు ఆనంద్తో కలిసి బైక్పై తిరిగి నస్పూర్కు వెళ్తుండగా, ఎదురుగా వచ్చిన కారు వీరిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రమేష్ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించగా, ఆయన భార్య మరియు కుమారుడు గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి