కేంద్ర కేబినెట్ లో తెలుగు రాష్ట్రాల నుంచి వీరికే ఛాన్స్
కేంద్ర కేబినెట్ లో తెలుగు రాష్ట్రాల నుంచి వీరికే ఛాన్స్
కేబినెట్ ప్రక్షాళనకు రంగం సిద్దం అవుతోంది. సెప్టెంబర్ తొలి వారంలో కేబినెట్ లో కీలక మార్పులు జరగనున్నాయి. ఇప్పటికే ఈ మేరకు తుది కసరత్తు జరుగుతోంది. దీంతో, ఈ సారి విస్తరణలో జనసేనకు ఛాన్స్ దక్కుతుందని ప్రచారం సాగుతోంది. జనసేన ఎంపీ లు ముగ్గురు ఉన్నారు. పవన్ తుది నిర్ణయం కీలకం కానుంది. జనసేన ముందుకు రాకుంటే టీడీపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఖాయమని తెలుస్తోంది. అదే విధంగా తెలంగాణ నుంచి ప్రస్తుతం కేంద్ర మంత్రులుగా ఉన్న ఇద్దరూ కొనసాగనున్నారు. తాజాగా బీజేపీ జాతీయ కమిటీలో తెలంగాణ కు ప్రాతినిధ్యం దక్కలేదు. కొత్తగా అదిలాబాద్ ఎంపీ నగేశ్, డీకే అరుణ, డాక్టర్ లక్ష్మణ్ పేర్లు రేసు లో ఉన్నాయి. అయితే.. ప్రస్తుతం కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి.. బండి సంజయ్ ను కొనసాగిస్తూనే... మరో ఇద్దరికి అవకాశం ఉందని చెబుతున్నారు. మహిళకు అవకాశం ఇవ్వాలని భావిస్తే డీకే అరుణకు ఖాయమని తెలుస్తోంది. అదే విధంగా ఈటల రాజేందర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. దీంతో.. తెలుగు రాష్ట్రాల నుంచి కొత్తగా కేంద్ర మంత్రులు అయ్యేందుకు ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఆసక్తికరంగా మారుతోంది.