www.ntodaynews.com
కేసీఆర్, బీజేపీని బొందపెట్టాలి: రాంచందర్ నాయక్
తెలంగాణ
గిరిజనుల ప్రతి ఇంటా ఇందిరమ్మ ఫొటో ఉండాలి.. కాంగ్రెస్కు అండగా నిలవాలని పిలుపు
డోర్నకల్: కేసీఆర్, బీజేపీని రాజకీయంగా బొందపెట్టకపోతే వెనుకబడిన జాతుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ అన్నారు. ఇందిరమ్మ ఆశీర్వాదయాత్రలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, గిరిజనులు ప్రతి ఇంటా ఇందిరమ్మ ఫొటోను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
సేవాలాల్ మహారాజ్ను ఎలా ఆరాధిస్తామో, అదే విధంగా ఇందిరమ్మను కూడా గౌరవించాలని పేర్కొన్నారు. "ఒకే మాట.. ఒకే బాట.. ఒకే చోట" అనే నినాదంతో గిరిజనులందరూ ఏకమై కాంగ్రెస్ను ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు. వెనుకబడిన వర్గాల సంక్షేమం, అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని రాంచందర్ నాయక్ తెలిపారు.