BREAKING
ఉపాధి హామీ కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ.. కుప్పంలో టీడీపీ SIR కార్యక్రమం నిర్వహణ శ్రీశైలం మల్లన్న స్వామికి వెండి నాగాభరణం సమర్పణ శ్రీశైలంలో వీరశైవ ఆగమ పాఠశాల ప్రవేశ పరీక్ష నిర్వహణ శ్రీశైలంలో కొనసాగుతున్న యోగా శిక్షణా కార్యక్రమాలు వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగ నాయకుడి వాలీమా వేడుకలో పాల్గొన్న మాజీ మంత్రి పట్టణంలో వాహనాల తనిఖీలు నిర్వహించిన అర్బన్ ఎస్ఐ హజరత్తయ్య నియోజకవర్గ ఆర్థికాభివృద్ధికి ఆటోనగర్ కేంద్రబిందువు కావాలి : ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పెరిగిన ధరలపై చిలకలూరిపేటలో ప్రజాసంఘాల ధర్నా తెలుగుదేశం పార్టీ రాజ్యసభ స్థానాలు ఎన్నిక ఉపాధి హామీ కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ.. కుప్పంలో టీడీపీ SIR కార్యక్రమం నిర్వహణ శ్రీశైలం మల్లన్న స్వామికి వెండి నాగాభరణం సమర్పణ శ్రీశైలంలో వీరశైవ ఆగమ పాఠశాల ప్రవేశ పరీక్ష నిర్వహణ శ్రీశైలంలో కొనసాగుతున్న యోగా శిక్షణా కార్యక్రమాలు వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగ నాయకుడి వాలీమా వేడుకలో పాల్గొన్న మాజీ మంత్రి పట్టణంలో వాహనాల తనిఖీలు నిర్వహించిన అర్బన్ ఎస్ఐ హజరత్తయ్య నియోజకవర్గ ఆర్థికాభివృద్ధికి ఆటోనగర్ కేంద్రబిందువు కావాలి : ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పెరిగిన ధరలపై చిలకలూరిపేటలో ప్రజాసంఘాల ధర్నా తెలుగుదేశం పార్టీ రాజ్యసభ స్థానాలు ఎన్నిక
www.ntodaynews.com

కేసీఆర్ మరమనిషి కాదు.. కోట్లాది మందిని ఆదుకున్న మనీషి

తెలంగాణ
/ మంచిర్యాల / క్యాతనపల్లి
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
26 Apr, 2026 - 04:27 PM
48 వీక్షణలు

కేసీఆర్ మరమనిషి కాదు.. కోట్లాది మందిని ఆదుకున్న 'మనీషి': మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఫైర్"

మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో పార్టీలు పెట్టుకునే హక్కు ఎవరికైనా ఉంటుందని, అయితే గతంలో పార్టీలు పెట్టిన నాయకుల గతే కవితకు కూడా పడుతుందని హెచ్చరించారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీలను ప్రశ్నించకుండా కేవలం ప్రతిపక్షాలపై విమర్శలు చేయడం చూస్తుంటే ఆమె ఎవరి ప్రయోజనాల కోసం పార్టీ పెట్టారో అర్థమవుతోందని ఎద్దేవా చేశారు. తెలంగాణ సాధకుడైన కేసీఆర్‌ను 'మరమనిషి' అని విమర్శించే అర్హత కవితకు లేదని, లక్షలాది మంది రైతులకు రైతుబంధు అందించిన కేసీఆర్ గొప్ప మనసున్న మనిషని కొనియాడారు. ఇదే సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయని రేవంత్ రెడ్డిని ప్రశ్నించాలని సూచించారు. అనంతరం, సింగరేణిలో మెడికల్ బోర్డు ఏర్పాటు చేసి వారసత్వ ఉద్యోగాలు కల్పించాలని, అలాగే చెన్నూరు ప్రజలకు మంత్రి వివేక్ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని బాల్క సుమన్ డిమాండ్ చేశారు