www.ntodaynews.com
కేటీఆర్పై ఎంపీ వంశీకృష్ణ వ్యాఖ్యలకు నిరసనగా మంచిర్యాలలో బీఆర్ఎస్ ఆందోళన
తెలంగాణ
/
మంచిర్యాల
/
మంచిర్యాల
కేటీఆర్పై ఎంపీ వంశీకృష్ణ వ్యాఖ్యలకు నిరసనగా మంచిర్యాలలో బీఆర్ఎస్ ఆందోళన
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారిపై పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి.
మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు మరియు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఈ నిరసన కార్యక్రమం జరిగింది. జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా (అంబేద్కర్ విగ్రహం) వద్ద మంచిర్యాల పట్టణ బీఆర్ఎస్ మాజీ అధ్యక్షులు గాదె సత్యం ఆధ్వర్యంలో కార్పొరేషన్ బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ఎంపీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు