www.ntodaynews.com
కడప సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న జీవిత ఖైదీ పరారీ
ఆంధ్రప్రదేశ్
/
వైఎస్ఆర్ కడప
కడప సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న జీవిత ఖైదీ ముద్దాయి సాకే రాజ్కుమార్, అనారోగ్య కారణాల వల్ల ఏప్రిల్లో విశాఖపట్నం ఆసుపత్రికి తరలింపయ్యాడు. అయితే, విశాఖ ఆసుపత్రి నుంచి తిరిగి జైలుకు తీసుకువస్తుండగా గూడూరు రైల్వే స్టేషన్లో తప్పించుకుని పారిపోయాడు.
రాజ్కుమార్ నంద్యాలలో జరిగిన కానిస్టేబుల్ హత్య కేసులో ప్రధాన ముద్దాయి. అదనంగా, పోక్సో కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న ఆయన పరారీతో స్థానిక ప్రజలలో భయం నెలకొన్నది.