కళాశాలల బంద్ ను విజయవంతం చేయండి ఏబీవీపీ
కళాశాలల బంద్ ను విజయవంతం చేయండి
ఏబీవీపీ రాష్ట్ర నాయకులు జేపీ నాగిరెడ్డి పిలుపు
రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న కళాశాలల సమస్యల పరిష్కారంతోపాటు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఈనెల 5వ తేదీన జరగబోయే కళాశాలల బందును విజయవంతం చేయాలని ఏబీవీపీ రాష్ట్ర నాయకులు జేపీ నాగిరెడ్డి పిలుపునిచ్చారు.సోమవారం ఆయన రాయచోటి పట్టణంలోని ఏబీవీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా కళాశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 5 వ తేదీన జరగబోయే కళాశాలల బంద్ కు విద్యార్థులు,తల్లిదండ్రులు,అధ్యాపకులు సహకరించి విజయవంతం చేయాలని కోరారు.అలాగే రాష్ట్రంలోని కళాశాలలో పెండింగ్ లో ఉన్న రూ.6,800 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలన్నారు.అలాగే జీవో నెంబర్ 77 ను వెంటనే రద్దు చేయాలని,ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో వసతులు పెంచి ప్రైవేట్ అకాడమీ దోపిడీని అరికట్టాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఏబీవీపీ విద్యార్థి నాయకులు "బాగ్ కన్వీనర్ పెసల విజయ్,సతీష్,సాయి తేజ,శివ తదితర విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.