BREAKING
మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
www.ntodaynews.com

కళాశాలల బంద్ ను విజయవంతం చేయండి ఏబీవీపీ

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
JP.Nagireddy రాయచోటి మండల ప్రతినిధి
03 Aug, 2026 - 09:57 PM
28 వీక్షణలు

కళాశాలల బంద్ ను విజయవంతం చేయండి

ఏబీవీపీ రాష్ట్ర నాయకులు జేపీ నాగిరెడ్డి పిలుపు

రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న కళాశాలల సమస్యల పరిష్కారంతోపాటు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఈనెల 5వ తేదీన జరగబోయే కళాశాలల బందును విజయవంతం చేయాలని ఏబీవీపీ రాష్ట్ర నాయకులు జేపీ నాగిరెడ్డి పిలుపునిచ్చారు.సోమవారం ఆయన రాయచోటి పట్టణంలోని ఏబీవీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా కళాశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 5 వ తేదీన జరగబోయే కళాశాలల బంద్ కు విద్యార్థులు,తల్లిదండ్రులు,అధ్యాపకులు సహకరించి విజయవంతం చేయాలని కోరారు.అలాగే రాష్ట్రంలోని కళాశాలలో పెండింగ్ లో ఉన్న రూ.6,800 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలన్నారు.అలాగే జీవో నెంబర్ 77 ను వెంటనే రద్దు చేయాలని,ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో వసతులు పెంచి ప్రైవేట్ అకాడమీ దోపిడీని అరికట్టాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఏబీవీపీ విద్యార్థి నాయకులు "బాగ్ కన్వీనర్ పెసల విజయ్,సతీష్,సాయి తేజ,శివ తదితర విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.