క్లస్టర్ ఇన్ఛార్జిలతో సీఎం చంద్రబాబు సమావేశం
క్లస్టర్ ఇన్ఛార్జిలతో సీఎం చంద్రబాబు సమావేశం
పాల్గొన్న యువ నాయకుడు: ఉయ్యాల దిలీప్ కుమార్ (టీడీపీ చాట్రాయి మండల క్లస్టర్ ఇన్చార్జి)
టీడీపీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్లస్టర్ ఇన్చార్జిలతో శిక్షణా తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యకర్తలందరికీ మార్గదర్శకంగా మాట్లాడుతూ, "అవకాశాలను సద్వినియోగం చేసుకుని, నాయకులు, కార్యకర్తలు ఎదగాలి. ప్రజల కోసం చేసిన మంచి వాటి ద్వారా వారి మనసులలో నిలిచిపోతారు. ప్రజలు మార్పును చూస్తారు. ఈ ప్రస్థానంలో అధికారంలో ఉండటం మాత్రమే అభివృద్ధిని సాధించగలదు" అని పేర్కొన్నారు.
ఆయన 2019 ఎన్నికలలో వైసీపీ విజయం సాధించినప్పటికీ, రాష్ట్రం అభివృద్ధి పథం నుండి వెనక్కి వెళ్లిందని, "నన్ను అరెస్టు చేసినా, పార్టీని ఇబ్బంది పెట్టినా, ప్రజలే నాకు మద్దతుగా నిలిచారు. రాజకీయం దాటినవారు సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేసారు" అని కూడా ఆయన వివరించారు.
ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా చాట్రాయి మండలం పర్వతాపురం గ్రామానికి చెందిన టీడీపీ యువ నాయకుడు ఉయ్యాల దిలీప్ కుమార్ కూడా పాల్గొని, సమాజ సేవ కోసం తన వంతు కృషిని పంచుకున్నారు.