కళ్యాణానికి తరలి వెళ్ళిన ఉత్సవ మూర్తులు NTODAY NEWS చిట్యాల
వైభవంగా బాల నరసింహుని ఉత్సవ మూర్తుల ఊరేగింపు
నల్గొండ జిల్లా చిట్యాల మండల కేంద్రం ఆధ్యాత్మిక శోభతో పులకించిపోయింది. స్థానిక శ్రీ శ్రీ శ్రీ బాల నరసింహ స్వామి వారి కళ్యాణ మహోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం రోజున స్వామివారి ఉత్సవ మూర్తులను ఆలయానికి అంగరంగ వైభవంగా ఊరేగింపుగా తరలించారు. జయజయధ్వానాలు
పట్టణ పురవీధుల గుండా సాగిన ఈ ఊరేగింపులో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మహిళల కోలాట ప్రదర్శనలు, మంగళవాయిద్యాలు, భజనలతో చిట్యాల పురవీధులు మారుమోగాయి. భక్తులు అడుగుడుగునా స్వామివారికి నీరాజనాలు పడుతూ భక్తిపారవశ్యంలో మునిగితేలారు. స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్సవ కమిటీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ధూప దీప నైవేద్య అర్చక సంఘం అధ్యక్షుడు వాసుదేవ శర్మ , గోవిందు, కమిటీ సభ్యులు మరియు స్థానిక ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.