www.ntodaynews.com
కమిషనర్ను నిలదీసిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు
తెలంగాణ
/
మంచిర్యాల
/
క్యాతనపల్లి
క్యాతనపల్లి మున్సిపాలిటీలో "ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం" సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మున్సిపల్ కమిషనర్ మారుతీ ప్రసాద్ బీఆర్ఎస్ కౌన్సిలర్ల వార్డుల పట్ల తీవ్ర వివక్ష చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు ఆయనను నిలదీశారు. కేవలం కాంగ్రెస్ కౌన్సిలర్లు ఉన్న వార్డుల్లోనే కొత్త రోడ్ల నిర్మాణాలు చేపడుతూ, తమ వార్డులకు మాత్రం పైసా నిధులు కేటాయించడం లేదని కౌన్సిలర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ కమిషనర్ పక్షపాత వైఖరిపై మండిపడ్డారు