BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

​సీసీసీలో వైభవంగా మైసమ్మ తల్లి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న మేయర్ దర్ని మధుకర్

తెలంగాణ
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
23 Jul, 2026 - 05:50 PM
85 వీక్షణలు

​సీసీసీలో వైభవంగా మైసమ్మ తల్లి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న మేయర్ దర్ని మధుకర్

మంచిర్యాల: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సీసీసీ రాయల్ టాకీస్ వద్ద ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని అన్నపూర్ణ సొసైటీ (వార సంత వ్యాపారస్తులు) ఆధ్వర్యంలో శ్రీ మైసమ్మ తల్లి బోనాల జాతర అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవోపేతంగా జరిగింది. ఈ పవిత్రమైన వేడుకకు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ దర్ని మధుకర్, టీపీసీసీ సభ్యులు నూకల రమేష్‌లతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు, ఆశీర్వాదాలు అందుకున్నారు.

​ఈ సందర్భంగా మేయర్ మధుకర్ జాతర నిర్వాహకులను అభినందిస్తూ.. మన సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షిస్తూ ముందు తరాలకు తెలిసేలా ఇటువంటి ఆధ్యాత్మిక వేడుకలను ఘనంగా నిర్వహించడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. ఈ జాతరలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ తాళ్ళ సంపత్ రెడ్డి, అన్నపూర్ణ వారసంత గౌరవ అధ్యక్షులు రాచకొండ వెంకటేశ్వర్ రావు, స్థానిక వ్యాపారస్తులు, అన్నపూర్ణ సొసైటీ సభ్యులు మరియు భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు