www.ntodaynews.com
కన్న తల్లి, కుమారుడి మృతిని తట్టుకోలేక.. మనస్తాపంతో వ్యక్తి సూసైడ్
తెలంగాణ
/
తెలంగాణ
ములుగు | NTODAY NEWS
తెలంగాణలోని ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. తల్లి, కుమారుడి వరుస మరణాలను తట్టుకోలేక కంతి నాగయ్య (40) బలవన్మరణానికి పాల్పడ్డారు.
మంగవాయి గ్రామానికి చెందిన నాగయ్య తల్లి కన్నమ్మ (70) ఈ ఏడాది మార్చిలో అనారోగ్యంతో మృతి చెందారు. ఆ విషాదం నుంచి కోలుకోకముందే ఆయన పెద్ద కుమారుడు అశోక్ (22) రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.
ఈ రెండు విషాద ఘటనలతో తీవ్ర మనోవేదనకు గురైన నాగయ్య మద్యానికి బానిసయ్యారని స్థానికులు తెలిపారు. ఈ క్రమంలో ఆదివారం పొలానికి వెళ్లి పురుగుమందు తాగగా, గమనించిన గ్రామస్థులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.