www.ntodaynews.com
మేడిగడ్డపై బీఆర్ఎస్ డ్రామాలు మానుకోవాలి : మంత్రి సీతక్క
తెలంగాణ
తెలంగాణ రాష్ట్రం: ములుగులో మంత్రి సీతక్క బీఆర్ఎస్ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. మేడిగడ్డ అంశంపై బీఆర్ఎస్ నేతలు డ్రామాలు మానుకోవాలని ఆమె సూచించారు. నేషనల్ సేఫ్టీ అథారిటీ నివేదిక ఆధారంగానే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని, కాళేశ్వరం నీళ్లపై ఎలాంటి కక్ష సాధింపు లేదని స్పష్టం చేశారు.
మేడిగడ్డ వద్ద ఏ చిన్న నష్టం జరిగినా పరిసర గ్రామాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ తప్పిదాల వల్ల ఏర్పడిన పరిస్థితులకు తమ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని మంత్రి సీతక్క ఆరోపించారు.