www.ntodaynews.com
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసుపై నేడు నాంపల్లి కోర్టులో విచారణ
తెలంగాణ
/
తెలంగాణ
హైదరాబాద్ | NTODAY NEWS
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో సోమవారం నాంపల్లి కోర్టులో కీలక విచారణ జరగనుంది. ఈ కేసులో నిందితులంతా వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరు కావాలని కోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసింది.
అయితే, సినీ నటుడు అల్లు అర్జున్ వ్యక్తిగత హాజరుకు బదులుగా వర్చువల్గా విచారణకు హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై ప్రభుత్వ తరఫు న్యాయవాది (పీపీ) అభ్యంతరం వ్యక్తం చేస్తూ, అల్లు అర్జున్కు వర్చువల్ హాజరుకు అనుమతి ఇవ్వకూడదని కోర్టును కోరారు.
ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ పిటిషన్పై నాంపల్లి కోర్టు నేడు నిర్ణయం వెలువరించనుంది. ఈ తీర్పుపై సినీ, న్యాయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.