www.ntodaynews.com
కొండవీడు లో నైట్ టెంట్స్ క్యాంపింగ్ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్
/
గుంటూరు
కొండవీడు లో నైట్ టెంట్స్ క్యాంపింగ్ ప్రారంభం
ఎడ్లపాడు మండలంలోని చారిత్రాత్మక కొండవీడు కోటపై నైట్ టెంట్స్ క్యాంపింగ్ ప్రారంభం కానుంది. జిల్లా యంత్రాంగం పర్యవేక్షణలో, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సహకారంతో 'కొండవీడు అడ్వెంచర్స్' ఈ వినూత్న అవకాశాన్ని అందజేస్తోంది. ప్యాకేజీ ప్రకారం పర్యాటకులు సాయంత్రం 5 గంటలకు కోటకు చేరుకుని రాత్రిపూట టెంట్లలో బస చేయవచ్చు. ఈ క్యాంపింగ్లో మ్యూజికల్ నైట్, క్యాంప్ఫైర్, సంప్రదాయ విందుతో పాటు మరుసటి రోజు ఉదయం సూర్యోదయ వీక్షణ, ట్రెక్కింగ్, బోటింగ్, కయాకింగ్ వంటి సాహస క్రీడలు పాల్గొనవచ్చు. ప్యాకేజీ ధర పెద్దలకు ₹2000, పిల్లలకు 8 ఏళ్ల లోపు ₹1000. ఇందులో స్నాక్స్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ సౌకర్యాలు కూడా అందించబడతాయి.