www.ntodaynews.com
కోటపాడు గ్రామంలో దౌర్జన్యంగా మామిడికాయలు కోసిన వారిపై చర్యలు చేపట్టాలని దీక్ష
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
కోటపాడు గ్రామంలో దౌర్జన్యంగా మామిడికాయలు కోసిన వారిపై చర్యలు చేపట్టాలని దీక్ష
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం కోటపాడు గ్రామంలో, తన స్వంత భూమిలో దౌర్జన్యంగా మామిడికాయలను కోసిన వారిపై పులగం వెంకటేశ్వరరెడ్డి నిరసన దీక్ష చేపట్టారు. ఆయన ఆరోపించనట్లుగా, కాసినేని మల్లేశ్వరరావు మరియు అతని అనుచరులు అక్రమంగా తన భూమిలో ప్రవేశించి మామిడికాయలు కోశారని, ఈ ఘటనకు సంబంధించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన తహసీల్దార్ కార్యాలయం ఎదుట బుధవారం నిరసన దీక్ష చేపట్టారు. ఈ దాడి గురించి చాట్రాయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పులగం వెంకటేశ్వరరెడ్డి, తనకు న్యాయం చేయాలని అధికారులను కోరారు. ఈ సంఘటనపై చర్యలు తీసుకోవాలని బాధితుడు విజ్ఞప్తి చేశారు.