BREAKING
NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన
www.ntodaynews.com

కరెంట్ షాక్‌తో పెనుగొలను యువకుడు మృతి

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 Jul, 2026 - 06:41 AM
98 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామానికి చెందిన మీనుగు గోపి (26) శనివారం కరెంట్ షాక్‌కు గురై మృతి చెందాడు.

పోలీసుల వివరాల ప్రకారం, గంపలగూడెం మండలం రాజవరం గ్రామంలో అబ్బూరి రాంబాబు ఇంటికి రంగులు వేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగలడంతో గోపి అక్కడికక్కడే మృతి చెందాడు.

మృతుడి తల్లి రమాదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గంపలగూడెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరువూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

కాగా, గోపి తండ్రి వెంకటేశ్వరరావు కూడా ఏడాది క్రితమే మృతి చెందారు. ఇప్పుడు పెళ్లీడుకొచ్చిన ఏకైక కుమారుడు దుర్మరణం చెందడంతో తల్లి రమాదేవి కన్నీరుమున్నీరుగా విలపించిన తీరు స్థానికులను కలచివేసింది.

ఈ ఘటనపై వాల్మీకి సంఘ నాయకులు, శిరిడి సాయిబాబా సేవా కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, స్థానికులు గోపి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సంతాపం తెలిపారు.